కరోనా మహమ్మారిపై పోరాటానికి మిజోరం గవర్నర్ విరాళం

ABN , First Publish Date - 2020-06-02T05:30:00+05:30 IST

నోవెల్ కరోనా వైరస్‌‌పై పోరాటంలో భాగంగా తన జీతంలో 30 శాతం ఆరు నెలల పాటు విరాళంగా..

కరోనా మహమ్మారిపై పోరాటానికి మిజోరం గవర్నర్ విరాళం

ఐజ్వాల్: నోవెల్ కరోనా వైరస్‌‌పై పోరాటంలో భాగంగా తనవంతు విరాళం అందించేందుకు మిజోరం గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై ముందుకొచ్చారు. తన జీతంలో నుంచి 30 శాతం మేర ఆరు నెలల పాటు విరాళంగా ఇవ్వాలని గవర్నర్ నిర్ణయించుకున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మొత్తం దాదాపు రూ.1 లక్షకు పైగా ఉంటుందని వారు వెల్లడించారు. కొవిడ్-19 పై సేవలు అందించేందుకు వీలుగా ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రాజ్‌భవన్‌లో ఖర్చులను భారీగా తగ్గించే కొన్ని చర్యలను కూడా ఆయన చేపట్టనున్నట్టు సమాచారం.

Updated Date - 2020-06-02T05:30:00+05:30 IST