సర్వసిద్ధి పీహెచ్సీ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
ABN , First Publish Date - 2021-08-02T06:19:23+05:30 IST
ప్రభుత్వా ధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు.
ఎస్.రాయవరం, ఆగస్టు 1 : ప్రభుత్వా ధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. మండలం లోని సర్వసిద్ధి పీహెచ్సీని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న పలువురు మాట్లాడుతూ పీహెచ్ సీలో సకాలంలో వైద్య సేవలు అందడం లేదని, గ్రామీణ ప్రాంతానికి చెందిన రోగులు ఆస్పత్రికి వస్తే వైద్య సిబ్బంది కస్సుబుస్సు లాడు తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై అస హనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రిలో హాజరుపట్టిని పరిశీలించి, సిబ్బంది గైర్హాజరయ్యారని గుర్తించారు. వెంటనే ఫోన్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో మాట్లాడుతూ సర్వసిద్ధి ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా పని చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సీఎం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.