పోలవరం నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది: ఎమ్మెల్యే బాలరాజు

ABN , First Publish Date - 2021-11-13T22:05:46+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములను కోల్పోయిన నిర్వాసితుల

పోలవరం నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది: ఎమ్మెల్యే బాలరాజు

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములను కోల్పోయిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డి గణపవరం సమీపంలో పోలవరం నిర్వాసితులకు నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలను ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్వాసితుల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలలో నెలకొన్న సమస్యలపై నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు. పునరావాసకాలనీలో నిర్మాణంలో ఉన్న ఇళ్ళని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉన్న ఊరుని , పొలాలన్ని వదలి ప్రాజెక్టు కోసం త్యాగం చేశారన్నారు. నిర్వాసితుల త్యాగాలను వెల కట్టలేమన్నారు. అందుకే నిర్వాసితుల కోసం అన్ని వసతులతో కూడిన సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు.


అదే విధంగా కాలనీలో పూర్తి నాణ్యతతో డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని అధికారులకు బాలరాజు  సూచించారు. నిర్వాసితులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫోన్‌లో అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే  బాలరాజు హామీ ఇచ్చారు.

Updated Date - 2021-11-13T22:05:46+05:30 IST