నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా ఉంటా
ABN , First Publish Date - 2021-05-17T06:03:40+05:30 IST
కరోనా కష్ట సమయంలో ఎవరూ భయపడాల్సి న పని లేదని, నియోజకవర్గంలోని ప్రజలకు జవాబుదారిగా నేనున్నా నంటూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ, మే 16 : కరోనా కష్ట సమయంలో ఎవరూ భయపడాల్సి న పని లేదని, నియోజకవర్గంలోని ప్రజలకు జవాబుదారిగా నేనున్నా నంటూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భరోసా ఇచ్చారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఎవరూ భయపడాల్సిన అ వసరం లేదని, ఎవరికైనా బెడ్ కావాలంటే వెంటనే 9848157536 నంబ రును సంప్రదిస్తే వెంటనే బెడ్ను ఏర్పాటు చేస్తానని, ఆ జవాబుదారి తనాన్ని తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకొని వ్యాధి తీవ్రతను బట్టి వైద్యులు సూచించిన మేరకు కేటాయించిన వైద్యశాలల్లో చేరే అవకాశం ఉందని అన్నారు. డైరెక్ట్గా ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకొని తరువాత ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి ఇబ్బం ది పడే కంటే డైరెక్టర్గా ప్రభుత్వ వైద్యశాలకు వస్తే నాగిరెడ్డిపల్లి సమీ పంలోని కొవిడ్ కేర్ సెంటర్ లేదా కరోనా తీవ్రతను బట్టి విను కొండ లోని ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉందన్నా రు. వినుకొండలో పూర్తి స్థాయిలో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశామని మాటలు చెప్పడమే తప్ప పనిలో ప్రయోజనం లేదని కొందరు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తాము అలాంటి వారిమి కాదని, వైద్యం సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి ఉన్నారు.