కార్యకర్తకు గొడుగు పట్టిన MLA

ABN , First Publish Date - 2021-11-15T17:33:06+05:30 IST

పుదుకోట జిల్లా సీపీఎం జిల్లా మహాసభ శనివారం జరిగింది. సమావేశంలో పలు తీర్మానాలతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం పీయూ చిన్నప్ప పార్క్‌లో రాత్రి బహిరంగ సభ ఏర్పాటుచేశారు

కార్యకర్తకు గొడుగు పట్టిన MLA

చెన్నై/ పెరంబూర్: పుదుకోట జిల్లా సీపీఎం జిల్లా మహాసభ శనివారం జరిగింది. సమావేశంలో పలు తీర్మానాలతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం పీయూ చిన్నప్ప పార్క్‌లో రాత్రి బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గంధర్వకోట ఎమ్మెల్యే ఎం.చిన్నదురై పాల్గొని ప్రసంగించారు. అనంతరం పార్టీ సభ్యుడు జగన్‌ మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా వర్షం కురిసింది. వర్షంలోనూ జగన్‌ మాట్లాడుతుండడం గమనించి ఎమ్మెల్యే అతనిపై గొడుగు పట్టుకొని ప్రసంగం ముగిసే వరకు నిల్చున్నాడు. 

Updated Date - 2021-11-15T17:33:06+05:30 IST