గోసంరక్షణపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు దారుణం
ABN , First Publish Date - 2021-07-29T04:45:23+05:30 IST
గోసంరక్షణపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు జగదీశ్వరస్వామి ఆరోపించారు.
సుండుపల్లె, జూలై28: గోసంరక్షణపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు జగదీశ్వరస్వామి ఆరోపించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా సుండుపల్లె తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేయడంతో పాటు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా గోమాతల తరలింపును అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసుల ఎదురుగానే దాడులు చేయడం చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైయం జిల్లా కార్యదర్శి శివశంకర్, బీజేపీ నాయకులు వెంకట్రామరాజు, గోపాలరాజు, సత్యంనాయుడు, సుబ్బరామరాజు, సుబ్బరాజు, బాలాజీ, గాలి భాస్కర్ పాల్గొన్నారు.