Minister కేటీఆర్‌ మాట వినే ఆఫీసరే లేరు : ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-10T11:52:52+05:30 IST

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మాట వినేందుకు ఏ ఆఫీసరు లేరని...

Minister కేటీఆర్‌ మాట వినే ఆఫీసరే లేరు : ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎద్దేవా


హైదరాబాద్‌ సిటీ : మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మాట వినేందుకు ఏ ఆఫీసరు లేరని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎద్దేవా చేశారు. నగరంలో ఎక్కడైనా నాలాలు కబ్జా ఉంటే వెంటనే తొలగించాలని మరోసారి మంత్రి కేటీఆర్‌ కామెంట్‌ చేశారని, ఇలా అసెంబ్లీలో, వివిధ కార్యక్రమాల సందర్భంగా ఎన్నో సార్లు మాటలు చెప్పిన అమలుకావడం లేదన్నారు. నాలాల ఆక్రమణపై మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాల నేపథ్యంలో గురువారం రాజాసింగ్‌ స్పందించారు. పాతబస్తీ లో, నగరంలోని ఇతర ప్రాంతాల్లో, గోషామహల్‌ నియోజకవర్గంలో నిజాం కాలం నాటి నాలాలు అదే సైజుతో ఉన్నాయని, వాటిని పూర్తిగా ఆక్రమించారని అన్నారు.

Updated Date - 2021-12-10T11:52:52+05:30 IST