పేదలను ఆదుకునే పార్టీ టీడీపీ: ఎమ్మెల్యే గద్దె
ABN , First Publish Date - 2022-01-19T06:46:36+05:30 IST
పేదలను ఆదుకునే పార్టీ టీడీపీ: ఎమ్మెల్యే గద్దె
పటమట: కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా పేదలను ఆదుకోవడం, వారికి సేవలందించే పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మంగళవారం అశోక్నగర్లోని టీడీపీ కార్యాలయంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువత పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎండీ రహీం అప్సర్ నివాళులర్పించారు. లైఫ్ షేర్ చైర్మన్ కాశీ వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, కార్పొరేటర్లు పొట్లూరి సాయిబాబు, ముమ్మనేని ప్రసాద్, శాయన సత్యనారాయణ, ఫిరోజ్, గాబ్రియేలు, గద్దె ప్రసాద్ పాల్గొన్నారు.