ఎమ్మెల్యే వేడుకల్లో విషాదం
ABN , First Publish Date - 2021-11-21T01:11:54+05:30 IST
జిల్లాలోని గొలుగొండ మండలం ఎర్రవరం గ్రామంలో ఎమ్మెల్యే గణేష్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా యువకులకు విద్యుత్ షాక్ తగిలింది.
విశాఖ: జిల్లాలోని గొలుగొండ మండలం ఎర్రవరం గ్రామంలో ఎమ్మెల్యే గణేష్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే గణేష్ ఫ్లెక్సీ కడుతుండగా ఐదుగురు విద్యుత్ షాక్కు గురయ్యారు. గోలుగొండ మండలం చీడిగుమ్మల యర్రవరం గ్రామానికి చెందిన పట్నాల లవ కుశ వయసు( 34 ) మృతి చెందాడు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. మృతుడు పట్నాల లవకుశ ను పోస్ట్ మార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.