పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శలు

ABN , First Publish Date - 2021-10-02T21:51:31+05:30 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శలు గుప్పించారు. ఏపీలో శాంతి భద్రతలకు పవన్ విఘాతం కల్గిస్తున్నారని మండిపడ్డారు.

పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శలు

పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శలు గుప్పించారు. ఏపీలో శాంతి భద్రతలకు పవన్ విఘాతం కల్గిస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో విద్రోహ శక్తులను ప్రోత్సహించేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. గాడ్సేను పూజిస్తున్న పార్టీలతో పవన్‌ పొత్తుపెట్టుకుని గాంధీ శాంతియుత మార్గాన్ని తుంగలోకి తొక్కుతున్నారని చెప్పారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-02T21:51:31+05:30 IST