ఎమ్మెల్యే పాదయాత్ర అభినందనీయం : ఎంపీ
ABN , First Publish Date - 2021-03-05T06:20:40+05:30 IST
క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం, అక్కడికక్కడే అవకాశం ఉంటే పరిష్కరించడం కోసం ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ చేపట్టిన పాదయాత్ర అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
కోదాడ, మార్చి 4 : క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం, అక్కడికక్కడే అవకాశం ఉంటే పరిష్కరించడం కోసం ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ చేపట్టిన పాదయాత్ర అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ప్రజల కోసం - ప్రగతి కోసం పేరుతో ఎమ్మెల్యే కోదాడ పట్టణంలో 55 రోజులుగా చేపట్టిన పాదయాత్ర గురువారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ లింగయ్యయాదవ్ మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి పాదయాత్ర దోహదపడుతుందన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పట్టణవాసులు ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాదయాత్ర తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, టీఆర్ఎ్సనాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.