ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-25T02:35:40+05:30 IST

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: పేదలకిచ్చిన అసైన్డ్ భూమిపై కుటుంబాలు తరతరాలు ఆధారపడి జీవిస్తాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూముల విలువ పెరిగిందన్నారు. ఆ భూమాలను కేసీఆర్ పేదల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. తమ గోడును చెప్పుకోవడానికి వెళితే కలెక్టర్లు కలువడం లేదని మండిపడ్డారు. కలెక్టర్లు కూడా ఫామ్ హౌజ్‌లో పడుకుంటున్నారని విమర్శించారు. సిద్దాపూర్, కొండాపూర్‌లో పేదలకు ఇండ్ల కోసం ఇచ్చిన వంద ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. అక్కడ భూమి ఎకరా విలువ రూ.3 కోట్లకు పెరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూములను కూడా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. తమవారికి కట్టబెట్టడానికే అమ్మకానికి తెరలేపారని చెప్పారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కాపాడటానికి కాంగ్రెస్ యుద్ధం మొదలైందన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే గురుకులాలకు కార్యదర్శిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. దళిత సీఎం, మూడెకరాల భూమి విషయంలో కేసీఆర్ మోసంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ నిలదీయాలన్నారు. 

Updated Date - 2021-07-25T02:35:40+05:30 IST