‘ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది’
ABN , First Publish Date - 2020-12-04T17:58:55+05:30 IST
‘ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది’
ఆదిలాబాద్: జిల్లాలో పేదలకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఫ్రీ అంబులెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. అంబులెన్స్ నిర్వహణ విషయంలో వైద్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఇవాళ జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అందజేసిన అంబులెన్స్ను ఆయన కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి ప్రారంభించారు.