మిమ్మల్ని చూసి ప్రజలు భయపడుతున్నారు

ABN , First Publish Date - 2021-03-10T22:59:49+05:30 IST

ఇప్పటికే మిమ్మల్ని చూసి ప్రజలు భయపడుతున్నారని తోట త్రిమూర్తులును ఉద్దేశించి

మిమ్మల్ని చూసి ప్రజలు భయపడుతున్నారు

రాజమండ్రి: ఇప్పటికే మిమ్మల్ని చూసి ప్రజలు భయపడుతున్నారని తోట త్రిమూర్తులును ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మండపేట వైసీపీ కోఆర్డినేటర్ మధ్య వాగ్వివాదం జరిగింది. పోలింగ్ బూత్‌లోకి తోట త్రిమూర్తులు వెళ్ళటంపై ఎమ్మెల్యే జోగుళ్ళ అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ఇప్పటికే "మిమ్మల్ని చూసి మండపేట ప్రజలు భయపడుతున్నార"ని త్రిమూర్తులుని చూసి ఎమ్మెల్యే జోగుళ్ళ వ్యాఖ్యానించారు. "నేను వచ్చిన తర్వాత మండపేట ప్రజలకు స్వేచ్ఛ వచ్చింద"ని తోట త్రిమూర్తులు తిరుగు సమాధానం ఇచ్చారు. 



Updated Date - 2021-03-10T22:59:49+05:30 IST