మేమూ... మనుషులమే..!
ABN , First Publish Date - 2022-01-29T03:41:39+05:30 IST
మేమూ మనుషులమే.. మాకు ప్రభుత్వ సంక్షేమ పఽథకాలు వర్తింప చేయాలని కోరుతూ ట్రాన్స్జెండర్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్పకుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి ట్రాన్స్జెండర్ల వినతి
కావలిటౌన్, జనవరి 28: మేమూ మనుషులమే.. మాకు ప్రభుత్వ సంక్షేమ పఽథకాలు వర్తింప చేయాలని కోరుతూ ట్రాన్స్జెండర్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్పకుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం ముసునూరులోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసిన ట్రాన్స్జెండర్లు తమ సమస్యలు విన్నవించారు. ప్రభుత్వం మంజూరు చేసే పక్కాగృహాలు ఒకే ప్రాంతంలో అందరికీ కేటాయించాలని కోరారు. జీవనాధారం కోసం బయటకు వెళ్లినా తిరిగి గూటికి చేరుకోక తప్పదని, ఉండడానికి గూడులేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ షాహుల్ హమీద్, నాయబ్, పల్లపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.