మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ లేదు

ABN , First Publish Date - 2021-06-20T05:55:55+05:30 IST

శివారు కాలనీల్లో సైతం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించటంలో రాజీ పడేదిలేదని పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ లేదు
స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గిరిధర్‌ తదితరులు

ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌

గుంటూరు, జూన్‌ 19: శివారు కాలనీల్లో సైతం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించటంలో రాజీ పడేదిలేదని పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ పేర్కొన్నారు. రోజువారీ పర్యటనలో భాగంగా శనివారం ఎమ్మెల్యే సీతమ్మకాలనీ, సంతోష్‌నగర్‌ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడి గి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారితో కొన్ని అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని, పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్థి చేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీఎంసీ అధికారులు రమణ, రాము, చంద్రశేఖర్‌, భవానీ, సుధాకర్‌తో పాటు కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. 

Updated Date - 2021-06-20T05:55:55+05:30 IST