జనబాహుళ్యంలోకి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-08-13T08:03:48+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆశీర్వచనం, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో..

జనబాహుళ్యంలోకి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

 తన క్షేమంకోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు

 

శ్రీకాళహస్తి(చిత్తూరు): శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆశీర్వచనం, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తమ కుటుంబ సభ్యులందరూ కరోనా నుంచి కోలుకున్నామని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చెప్పారు. తమ కుటుంబ క్షేమం కోసం ప్రార్థించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లీ, దేవసేన సమేత కుమారస్వామిని బుధవారం ఆయన  దర్శించుకున్నారు. ఆడికృత్తికను పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లకు ఏకాంతంగా అభిషేకాలు, పూజలు నిర్వహించగా మధు మొక్కులు తీర్చుకున్నారు. పట్టణ ప్రజలను కరోనా నుంచి కాపాడాలని వేడుకున్నట్లు చెప్పారు. 

Updated Date - 2020-08-13T08:03:48+05:30 IST