నువ్వు ఏమైనా పోటుగాడివా..

ABN , First Publish Date - 2021-07-09T02:08:04+05:30 IST

తన బాధను చెప్పుకున్న రైతుపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో

నువ్వు ఏమైనా పోటుగాడివా..

పశ్చిమ గోదావరి: తన బాధను చెప్పుకున్న రైతుపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఊగిపోయారు. " నువ్వు ఏమైనా పోటుగాడివి అనుకుంటున్నావా" అంటూ కోపంతో రైతుపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు మండిపడ్డారు. జిల్లాలోని ఇరగవరం మండలంలోని అర్జునపాలెం గ్రామంలో రైతులపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దినోత్సవ కార్యక్రమం గ్రామంలో జరిగింది.  ఈ సందర్భంగా ఈ కార్యరక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. మూడు నెలలుగా తనకు ధాన్యం డబ్బులు పడలేదని ఎమ్మెల్యే నాగేశ్వరరావును  ఓ రైతు అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే, ఆ రైతును  ఉద్దేశించి "నువ్వు ఏమైనా పోటుగాడివి అనుకుంటున్నావా" అంటూ కోపంతో ఊగిపోయారు. దీంతో అక్కడున్న రైతులు విస్తూపోయారు.

Updated Date - 2021-07-09T02:08:04+05:30 IST