ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మరో ఎమ్మెల్యే ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-07-10T03:14:56+05:30 IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తణుకు పోలీసులకు..

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మరో ఎమ్మెల్యే ఫిర్యాదు

ఏలూరు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తణుకు పోలీసులకు మరో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. తన పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని, తనను జంతువులతో పోల్చారని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి రంగనాథరాజుతో పాటు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేశారు. ఇద్దరు కూడా తమను రఘురామకృష్ణంరాజు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-07-10T03:14:56+05:30 IST