గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎ్సదే విజయం
ABN , First Publish Date - 2021-04-19T06:26:16+05:30 IST
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎ్సదే విజయం
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఖిలావరంగల్, ఏప్రిల్ 18: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎ్సదే విజయమని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం ఖిలావరంగల్ 38వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి బైరబోయిన ఉమదామోదర్ యాదవ్ల నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ ్లకాలంలో రూ.35 కోట్లతో ఖిలావరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. ఎన్నిక ఏదైనా విజయం టీఆర్ఎ్సదేనన్నారు. ఎమ్మెల్యే ముందుగా స్వయంభూ దేవాలయం, చెవ ున్ వద్ద బొడ్రాయికి పూజలు చేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.