పోలీసులకు చట్టాలపై శిక్షణ ఇవ్వండి : నిమ్మల

ABN , First Publish Date - 2021-09-19T05:07:16+05:30 IST

డీజీపీ కార్యాల యం కూడా వైసీపీ కార్యాలయంలా మారిందని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానా యుడు విమర్శించారు.

పోలీసులకు చట్టాలపై శిక్షణ ఇవ్వండి : నిమ్మల
డీజీపీకి రాసిన లేఖ చూపిస్తున్న నిమ్మల

పాలకొల్లు అర్బన్‌, సెప్టెంబరు 18 : డీజీపీ కార్యాల యం కూడా వైసీపీ కార్యాలయంలా మారిందని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానా యుడు విమర్శించారు. తన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. నారా చంద్రబాబునాయుడు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ శుక్రవారం తన అనుచరులతో  దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వెళితే రోడ్డుపైనే గంట సేపు నిలబెట్టారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వస్తే రాచ మర్యాదలు చేసి డీజీపీ ఆఫీస్‌లోకి పంపించారన్నారు. ఇదె క్కడి అన్యాయం అని ప్రశ్నించారు. పోలీసులు తమ చదువులను మరిచి పోయా రా? అని అనిపిస్తోందని తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగే విధంగా పోలీసు లకు శిక్షణ ఇవ్వాలని డీజీపీకి తాను ఒక లేఖ రాశానన్నారు.

Updated Date - 2021-09-19T05:07:16+05:30 IST