కైలాస రథం డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2021-08-24T00:55:21+05:30 IST

కైలాస రథం డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే నిమ్మల

కైలాస రథం డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే నిమ్మల

పశ్చిమగోదావరి: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఔదార్యాన్ని చాటుకున్నారు. శ్మశానాలకు మృతదేహాలను తరలించే కైలాస రథానికి డ్రైవర్‌గా మారారు. ఆకస్మికంగా గుండెపోటుతో  మరణించిన వ్యక్తిని శ్మశాన వాటికకు ఆయన తీసుకెళ్లారు. కైలాస రథం నడిపే డ్రైవర్‌కు కోవిడ్ పాజిటివ్ రావడంతో శ్మశాన వాటికకు కైలాస రథం నడిపేందుకు వేరే డ్రైవర్లు ఎవరూ ముందుకురాలేదు. దాంతో కైలాస రథం సేవలకు ఆటంకం కలగకూడదని డ్రైవర్లలో స్పూర్తినింపడానికి ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు స్వయంగా డ్రైవర్‌గా మారారు. సాటి మనిషిని ఆదుకోవడం, చనిపోయిన వ్యక్తికి సేవ చేయడం పుణ్యమని, మానవ ధర్మాన్ని అందరూ పాటించాలని నిమ్మల తెలిపారు. 




Updated Date - 2021-08-24T00:55:21+05:30 IST