భారతీయ జగన్ పార్టీగా మారిన బీజేపీ: Payyavula

ABN , First Publish Date - 2021-12-28T17:04:11+05:30 IST

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.

భారతీయ జగన్ పార్టీగా మారిన బీజేపీ: Payyavula

అనంతపురం: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం జరిగినా బీజేపీ మౌనంగా ఉంటుందని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడి జరిగినా పట్టించుకోలేదన్నారు. హిందుత్వ అంశాలపై కూడా బీజేపీ మౌనం వహిస్తోందని అన్నారు. ధర్మకర్త అశోక్‌గజపతిరాజుపై దాడి జరిగినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆర్థిక అరాచకాలపై బీజేపీ నేతలు నోరెత్తట్లేదన్నారు. కేంద్రం నిధులను దారిమళ్లిస్తున్నా బీజేపీ నేతలకు పట్టడంలేదని అన్నారు. బీజేపీ.. భారతీయ జగన్ పార్టీగా మారిందని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-12-28T17:04:11+05:30 IST