అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పీఆర్కే
ABN , First Publish Date - 2021-05-14T05:52:40+05:30 IST
పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను గురువారం ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.
మాచర్ల, మే 13: పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను గురువారం ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని గొర్రెల మండి వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జయంతి నగర్ కాలనీలో నూతన బోరు ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టారు. అలాగే పట్టణంలో రమా డెంటల్ హాస్పిటల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే పీఆర్కే వెంట వైసీపీ నేతలు ఉన్నారు.