కొండవీడు అభివృద్ధికి రూ.13.35 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2021-01-20T05:30:00+05:30 IST

కొండవీడుకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు.

కొండవీడు అభివృద్ధికి రూ.13.35 కోట్లు విడుదల

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని

చిలకలూరిపేట, జనవరి 20 : కొండవీడుకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు. స్థానిక తన కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొండవీడు అభివృద్ధికి సంబంధించి ఐదేళ్ల ప్రణాళిక, ప్రాజెక్టు పూర్తి నివేదికను గత ఏడాది అక్టోబరు 23న సీఎం జగన్‌మోహనరెడ్డి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల ప్రణాళికకు సంబంధించి రూ.13.35 కోట్లు ప్రభుత్వం ఈనెల 18న విడుదల చేస్తూ జీవో జారీ చేసిందన్నారు. 2020-21 సంవత్సరానికి రూ.7.79కోట్లు, 2021-22 సంవత్సరానికి రూ.1.26కోట్లు, 2022- 23 సంవత్సరానికి రూ.1.28కోట్లు, 2023-24 సంవత్సరానికి రూ.5.2కోట్లు ప్రభుత్వం మం జూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కొండవీడు కొండపై చిన్నపిల్లల పార్కు, పార్కింగ్‌ ఏరియా, మూడు వ్యూ పాయింట్‌లు, నరసింహస్వామి ఆలయం తదితర నిర్మాణాలు పూర్తికావస్తున్నాయన్నారు.

Updated Date - 2021-01-20T05:30:00+05:30 IST