టిడ్కో గృహాలను లబ్దిదారులకు అప్పగించాలి

ABN , First Publish Date - 2021-08-05T23:55:49+05:30 IST

గత ప్రభుత్వంలో 80 శాతం పూర్తాయిన టిడ్కో గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాలని

టిడ్కో గృహాలను లబ్దిదారులకు అప్పగించాలి

పశ్చిమ గోదావరి: గత ప్రభుత్వంలో 80 శాతం పూర్తాయిన టిడ్కో గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పేదలకు ప్రభుత్వం అందించే సెంటు స్థలంలో బాత్‌రూం నిర్మాణం కూడా జరగదన్నారు. పట్టణంలో నివసించే వారికి ఇచ్చే ఇళ్ల స్థలాలను పట్టణ పరిధిలో ఇవ్వాలే గాని దూర ప్రాంతమైన గ్రామాల్లో ఇవ్వడం అన్యాయమని ఎమ్మెల్యే రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-05T23:55:49+05:30 IST