పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2021-06-07T20:24:50+05:30 IST

జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో్ ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్‌

పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్‌ యాత్ర

పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో్ ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లులోని 9,10 వార్డులలో పర్యటించారు. ఆ వార్డులలో కరోనాతో బాధపడుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం వారికి నిత్యావసరాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యాక్సిన్ల‌లో ఎన్ని వినియోగించారని ఆయన ప్రశ్నించారు. వాటిలో ఎన్ని వ్యాక్సిన్లను వృథా చేసారో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న హెల్త్ వర్కర్లకి 83శాతం వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేయలేకపోయారని రామానాయుడు విమర్శించారు. 

Updated Date - 2021-06-07T20:24:50+05:30 IST