ఒకే వార్డులో కృష్ణచైతన్య, రవికుమార్ ప్రచారం
ABN , First Publish Date - 2021-03-02T05:30:00+05:30 IST
పట్టణంలోని 19వ వార్డులో ఒకేసారి ఇరుపార్టీల ప్రధాన నాయకులు ప్రచారం సాగింది. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొం ది.
అద్దంకి, మార్చి 2 : పట్టణంలోని 19వ వార్డులో ఒకేసారి ఇరుపార్టీల ప్రధాన నాయకులు ప్రచారం సాగింది. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొం ది. మంగళవారం రాత్రి ఒకే సమయంలో ఒక వైపు ఎమ్మెల్యే రవికుమార్, మరోవైపు వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య పర్యటన సా గింది. ఇరువర్గీయలు భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండటంతో ఎదురెదురు వస్తే పరిస్థితి ఏమిటని కొద్దిసేపు స్థానికు లు ఆందోళన చెందారు. అయితే ఇరువర్గీయులు ఎక్కడా ఎదురు పడకుండా ప్రచారాలు సాగటంతో ఊపిరి పీల్చుకున్నారు.