ప్రణాళికాబద్ధంగా ఉయ్యూరు అభివృద్ధి

ABN , First Publish Date - 2021-01-21T06:30:57+05:30 IST

ప్రణాళికాబద్ధంగా ఉయ్యూరు అభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా ఉయ్యూరు అభివృద్ధి

 ఉయ్యూరు, జనవరి 20 : పట్టణాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసేం దుకు  కృషి చేస్తున్నట్టు  ఎమ్మెల్యే కేపీ సారథి అన్నారు. స్థానిక 17వ వార్డులో బుధవారం ఏర్పాటు చేసిన  పేదల ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ది సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమన్నారు. వైసీపీ నాయకుడు రాజులపాటి రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన  కార్యక్ర మంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జంపాన కొండలరావు, గౌడకార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఈడే చాముండేశ్వరి, అబుకలాం,  కమిషనర్‌ రంగారావు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-21T06:30:57+05:30 IST