ఘనంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2021-07-23T06:57:07+05:30 IST
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పుట్టినరోజు వేడుకలు ఆయన కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
అవనిగడ్డ టౌన్, జూలై 22 : అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పుట్టినరోజు వేడుకలు ఆయన కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆరు మండలాల వైసీపీ ముఖ్య నేతలు, అధికారులు, అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే అవనిగడ్డ పంచాయతీ పాలకవర్గం తీసుకువచ్చిన 25 కిలోల భారీ కేక్ను కోసి అభిమానులకు పంచిపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపఽథ్యంలో పలువురు అభిమానులు ఎమ్మెల్యేకు నోట్ పుస్తకాలను బహూకరించగా వాటిని ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు దివి ఇలవేల్పు లంకమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకొని పట్లు వస్త్రాలు సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు, వైసిపి ముఖ్య నేతలు భోగాది శేషగిరి రావు, రేపల్లె శ్రీనివాసరావు, సింహాద్రి వెంకటేశ్వరరావు, మోకా బుచ్చిబాబు, గాజుల జయగోపాల్, నలుకుర్తి పృథ్వీరాజ్, అన్నపరెడ్డి వెంకట స్వామి తదితరులు ఎమ్మెల్యే సింహాద్రి పుట్టినరోజు వేడుక ల్లో పాల్గొన్నారు. చల్లపల్లి సర్కిల్ పోలీస్ సిబ్బంది, ఆరు మండలాల తహసీల్దార్లు, ఫైర్ సిబ్బంది, అధికా రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియ జేశారు.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో..
మోపిదేవి : ఎమ్మెల్యే సింహాద్రి రమే్షబాబు పుట్టినరోజును పురస్కరించుకుని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈవో ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే అభిమానులు రక్తదానం చేశారు.