కరోనా బాధితులకు సహకారం అందించాలి

ABN , First Publish Date - 2021-05-10T05:54:00+05:30 IST

కరోనా బాధితులకు సహకారం అందించాలి

కరోనా బాధితులకు సహకారం అందించాలి

మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

కాటారం, మే 9 : కరోనా బాధితులకు కాంగ్రెస్‌ శ్రేణులు సహాయ సహకారాలు అందించాలని మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. ఆరోగ్య సమస్యలున్న వారికి  ఆన్‌ లైన్‌ లేదా వాట్సాప్‌ ద్వారా వైద్య సమా చారం అందించాలని కోరారు. నిరు పేదలకు సరుకులు అందజేసే కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. కరోనా మహ మ్మారికి ప్రజలెవ రూ భయాందో ళనలు చెందొద్దని, అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్‌ లక్షణాలున్న వారందరికీ మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యం, అన్ని మండలాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని,  విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని సూచించారు.  


Updated Date - 2021-05-10T05:54:00+05:30 IST