ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికిస్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు’’

ABN , First Publish Date - 2021-11-16T21:52:48+05:30 IST

విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ ప్రకటించిన "స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు" ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అందుకున్నారు

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికిస్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు’’

హైదరాబాద్: విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ ప్రకటించిన  "స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు" ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అందుకున్నారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అవార్డు కార్యక్రమం జరిగింది.కరోనా, లాక్ డౌన్ సమయంలో,  హైదరాబాద్ నగరంలో గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాల వల్ల వచ్చిన వరదల సమయంలో రాజకీయాలకు అతీతంగా, ప్రజలకు, అంధులు, వికలాంగులు, అనాథలకు అందించిన అపారమైన సేవలతో పాటు గత అనేక సంవత్సరాలుగా నిర్విరామంగా సేవా కార్యక్రమాలలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొంటున్నారు.


ఆయన సేవలను గుర్తించిన "విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ" సుధీర్ రెడ్డికి "అంతర్జాతీయ స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు" ను ఇచ్చి గౌరవించింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, సోషల్ మీడియా ఇంచార్జ్ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-16T21:52:48+05:30 IST