రైతు బజార్లను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-03-30T16:58:21+05:30 IST

హైదరాబాద్: కరోనా నివారణ చర్యలలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి..

రైతు బజార్లను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

హైదరాబాద్: కరోనా నివారణ చర్యలలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రైతు బజార్లతో పాటు స్థానిక మార్కెట్‌ను మున్సిపల్, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు ఎక్కువగా రావడంతో ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న వనస్థలిపురంలోని రైతు బజార్‌ని రెండు భాగాలుగా చేసి ఒకటి పక్కనే ఉన్న భవనంలోకి.. మరొకటి పార్క్‌లోకి మార్చారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు, వినియోగదారులకు సుధీర్‌రెడ్డి వివరించారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న మరో పెద్ద మార్కెట్‌ అయిన ఎన్‌టీఆర్ నగర్ మార్కెట్‌ని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోకి తరలించారు. 




Updated Date - 2020-03-30T16:58:21+05:30 IST