నా ప్రజాదరణను కడియం ఓర్వలేకపోతున్నారు

ABN , First Publish Date - 2021-03-22T14:18:14+05:30 IST

జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ప్రజాదరణను చూసి

నా ప్రజాదరణను కడియం ఓర్వలేకపోతున్నారు

 జనగామ: జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓర్వలేకపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. తనపై శ్రీహరి చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్ ఇచ్చారు. తనపై కడియం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కడియం చర్యలను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని, సరైన సమయంలో తగిన నిర్ణయం తీసకుంటుందని ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు.


తనపై కడియం చేసిన ఆరోపణలపై పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన కార్యకర్తలను కోరారు. పార్టీ అధినేత దగ్గర పూర్తి సమాచారం ఉందని ఆయన తెలిపారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించ వద్దని శ్రీహరికి రాజయ్య సూచించారు. 


కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్య. కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య ఆదిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతకానివాడు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు.. చాలా మాట్లాడతాడని, చెల్లని రూపాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరిదగ్గర చాయ్ తాగినా, పదవి, పనులు ఇప్పిస్తానని ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. పదవులు అమ్ముకుంటున్నారు.. పనులు అమ్ముకుంటున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు.



Updated Date - 2021-03-22T14:18:14+05:30 IST