ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-10-24T15:51:32+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా తగ్గలేదు.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్

అమరావతి : కరోనా మహమ్మారి విజృంభణ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా తగ్గలేదు. తెలుగు రాష్ట్రాలు మొత్తాన్ని చుట్టేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఇలా ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపైనా ఈ మహమ్మారి దాడి చేస్తోంది. ఇక ఏపీ విషయానికొస్తే ఇప్పటికే పలువురు మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు పాజిటివ్ అని తేలింది. వారందరూ కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.


తాజాగా.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. శనివారం నాడు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆయనకు సూచించారు. గత నాలుగైదు రోజులుగా వంశీని కలిసిన కార్యకర్తలు, సన్నిహితులు, నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆయన అభిమానులు, కార్యకర్తలు ఈ విషయం తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-10-24T15:51:32+05:30 IST