కరోనా పేరిట ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ: ఎమ్మెల్యే వెలగపూడి

ABN , First Publish Date - 2020-08-13T13:41:41+05:30 IST

నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు కరోనా పేరుతో బాధితులను దోచుకుంటున్నాయని..

కరోనా పేరిట ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ: ఎమ్మెల్యే వెలగపూడి

ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు కరోనా పేరుతో బాధితులను దోచుకుంటున్నాయని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 19 రోజుల కిందట ఓ వ్యక్తి (38) లివర్‌ సమస్యతో రామ్‌నగర్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరితే కరోనా సోకినట్టు నిర్ధారించి చికిత్స చేస్తుండగా మంగళవారం మృతి చెందాడన్నారు. అయితే ఆ వ్యక్తి వైద్యానికి రూ.11.40 లక్షల బిల్లు వేశారని, అప్పటికే బాధితుని కుటుంబ సభ్యులు, ఆయన పనిచేసే షాపు యాజమాన్యం మూడు విడతలుగా రూ.తొమ్మిది లక్షల వరకు చెల్లించినా.. ఉదయం మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని రాత్రి వరకు ఇవ్వలేదన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వెలగపూడి డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-08-13T13:41:41+05:30 IST