ఉచితంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-09-22T05:41:21+05:30 IST

మండల కేంద్రంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సోమవారం ఉచితంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు

ఉచితంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

టేకులపల్లి, సెప్టెంబరు 21: మండల కేంద్రంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సోమవారం ఉచితంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించడంలో భాగంగానే ఉచితంగా కంప్యూటర్లు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు చదువుపట్ల శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు హరిసింగ్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-22T05:41:21+05:30 IST