ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ అమానుషం

ABN , First Publish Date - 2022-03-09T04:03:19+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ అమానుషమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ అన్నారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తప్పులను బయట పెడతారనే భయంతోనే బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారన్నారు.

ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ అమానుషం
నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

ఏసీసీ, మార్చి  8: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ అమానుషమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ అన్నారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తప్పులను బయట పెడతారనే భయంతోనే బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్‌రావు, పురుషోత్తం, తిరుపతి, కృష్ణ, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.  

మందమర్రిరూరల్‌: మండలంలోని వెంకటాపూర్‌లో మంగళవారం సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్‌, ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్‌ మాట్లాడుతూ  బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్‌ చేయడం అనాగరికమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ విధానాలు నియంతలా ఉన్నాయని, బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారని భావించి సస్పెండ్‌ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దళిత బంధు పథకం టీఆర్‌ఎస్‌ కార్యకర్తల బంధు పథకంగా మారిందని పేర్కొన్నారు.  పెంచాల రంజిత్‌, వేల్పుల చిరంజీవి, రమేష్‌, వినయ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-03-09T04:03:19+05:30 IST