టీడీపీ దిగజారుడు రాజకీయాలు

ABN , First Publish Date - 2021-10-24T05:26:16+05:30 IST

రాజకీయ భవిష్యత్తు లేదనే టీడీపీ నేతలు బూతులు వల్లిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.

టీడీపీ దిగజారుడు రాజకీయాలు
దీక్షలను విరమింపచేస్తున్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గిరిధర్‌, మేయర్‌ కావటి, ఏసురత్నం తదితరులు

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి 

ముగిసిన వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలు

గుంటూరు, అక్టోబరు 23: రాజకీయ భవిష్యత్తు లేదనే టీడీపీ నేతలు బూతులు వల్లిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ నేతల దుర్భాషలకు నిరసనగా గుంటూరు మార్కెట్‌ సెంటర్‌లో 48 గంటలు దీక్షకు దిగిన వైసీపీ నేతలు మండేపూడి పురుషోత్తం, జగన్‌ కోటి, ఓర్సు శ్రీనివాసరావు, స్వర్ణ, హనుమంతరావు, కిషోర్‌లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ను నోటికొచ్చినట్లు దుర్భాషలాడిన వారిలో నేటికీ పశ్చాత్తాపం కలగకపోవటం వారి నీచస్థితికి నిదర్శనమన్నారు. నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం  ప్రసంగించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు డైమండ్‌బాబు, షేక్‌ సజీలా, పార్టీ నేతలు ఆతుకూరి ఆంజనేయులు, షౌకత, కార్పొరేటర్లు, నాయకులున్నారు. 

 

Updated Date - 2021-10-24T05:26:16+05:30 IST