టీఆర్‌ఎ్‌సకు పీవీపై ప్రేమలేదు : ప్రొఫెసర్‌ ఆర్‌. రమేష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-05T07:06:25+05:30 IST

టీఆర్‌ఎ్‌సకు పీవీ నరసింహారావుపై ప్రేమ లేదని, ఆయన పేరు వాడుకుంటోందని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్‌ ఆర్‌. రమే్‌షరెడ్డి అన్నారు.

టీఆర్‌ఎ్‌సకు పీవీపై ప్రేమలేదు : ప్రొఫెసర్‌ ఆర్‌. రమేష్‌రెడ్డి

పంజాగుట్ట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎ్‌సకు పీవీ నరసింహారావుపై ప్రేమ లేదని, ఆయన పేరు వాడుకుంటోందని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్‌ ఆర్‌. రమే్‌షరెడ్డి అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సిటిజన్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. వాణీదేవికి పట్టభద్రుల నియోజకవర్గంపై అవగాహన లేదన్నారు. ఆమె ఏ రోజైనా పాలమూరు సందర్శించారా అని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే స్థానిక సమస్యలను మండలిలో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. టీఆర్‌ఎ్‌సకు ఓటు అడిగే అర్హత లేదని న్యాయవాది శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ప్రొఫెసర్‌ ఆర్‌. రమే్‌షరెడ్డికి ఆల్‌ సెయింట్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు డీసీ డన్గోరియా, సెయింట్‌ పాల్స్‌ అలుమ్ని అసోసియేషన్‌ అధ్యక్షుడు మజర్‌ అలీ, సామాజిక కార్యకర్త అనిల్‌కిషన్‌, పీపుల్స్‌ మేనిఫెస్టో ప్రతినిధి డాక్టర్‌ షోయబ్‌, తెలంగాణ పైవ్రేట్‌ టీచర్స్‌ ఫోరం మద్దతు ప్రకటించాయి.

Updated Date - 2021-03-05T07:06:25+05:30 IST