రేపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-12-09T18:40:04+05:30 IST

రేపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు నల్గొండ జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.

రేపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం

నల్గొండ : రేపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు నల్గొండ జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నల్గొండ కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సామగ్రిని అందజేశారు. సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సామగ్రిని అందజేశారు. యాదాద్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతి సామగ్రిని పంపిణీ చేశారు.

Updated Date - 2021-12-09T18:40:04+05:30 IST