ఉపాధ్యాయులను కలిసిన ఎస్టీయూ నాయకులు
ABN , First Publish Date - 2020-10-28T07:26:28+05:30 IST
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎస్టీయూ అభ్యర్థిని గెలిపించాలని ఆ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కేవీ శేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎస్టీయూ నాయకులు మండలంలో ని పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులను కలిశారు.
కడియం, అక్టోబరు 27: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎస్టీయూ అభ్యర్థిని గెలిపించాలని ఆ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కేవీ శేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎస్టీయూ నాయకులు మండలంలో ని పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులను కలిశారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.జ్యోతి, రాష్ట్ర కౌన్సిలర్ జీఎన్ఎం నాయుడు, రాష్ట్ర కో-కన్వీనర్ టి.శ్యామ్బాబు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్.సత్యనారాయణ, ఆలమూరు మండల మహిళా అధ్యక్షురాలు కె.సుజాత, జిల్లా నాయకులు కె.దుర్గారావు, ఎం.లక్ష్మీనారాయణ, కడియం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.లక్ష్మణరావు, దాసరి శివ, ఆర్థిక కార్యదర్శి జి.నాగవేంద్రరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.