ఇక ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
ABN , First Publish Date - 2021-10-21T06:55:39+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. జిల్లాలో స్థానిక సంస్థల కేటగిరిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా, అందులో ఒకటి ఖాళీ అయింది.
పిఠాపురం, అక్టోబరు 20: స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. జిల్లాలో స్థానిక సంస్థల కేటగిరిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా, అందులో ఒకటి ఖాళీ అయింది. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం పదవీకాలం ముగియడంతో ఈ ఖాళీ ఏర్పడింది. అప్పటినుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ఈ ఖాళీ భర్తీ కాలేదు. ఇప్పుడు మునిసిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్లకు ఎన్నికలు జరగడంతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిం ది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ)ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.