కేంద్ర సాహిత్య అకాడమీకి ధన్యవాదాలు: గోరేటి
ABN , First Publish Date - 2021-12-30T23:48:56+05:30 IST
తనకు అవార్డు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీకి
హైదరాబాద్: తనకు అవార్డు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఏబీఎన్తో గోరేటి వెంకన్న అన్నారు. తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా ఏబీఎన్తో ఆయన మాట్లాడారు. తనకు అవార్డ్ రావడం సంతోషంగా ఉందన్నారు. గత 40 ఏళ్లుగా ఎన్నో పాటలు, కవితలు, గేయాలు రచించానన్నారు. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సీఎం కేసీఆర్ తనను గౌరవించారని ఏబీఎన్తో వెంకన్న పర్కొన్నారు.
ఢిల్లీ: ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ వాగ్గేయకారుడు, జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. ‘వల్లంకి తాళం’ కవితా గేయ రచనకు వెంకన్నకు అవార్డు ఇచ్చారు. 2021 సంవత్సరానికి గానూ కవిత్వ విభాగంలో వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్టు లభించింది.