కమీషన్ల కొరకే కాళేశ్వరం

ABN , First Publish Date - 2021-01-14T06:33:30+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమీషన్ల కొరకే కాళేశ్వరం నిర్మాణాలను జరుపుతోందని, ప్రాజెక్టు వల్ల అదనంగా రైతులకు ఒరిగేది ఏమీ లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

కమీషన్ల కొరకే కాళేశ్వరం
జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

 జగిత్యాల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమీషన్ల కొరకే కాళేశ్వరం నిర్మాణాలను జరుపుతోందని, ప్రాజెక్టు వల్ల అదనంగా రైతులకు ఒరిగేది ఏమీ లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు నిష్ప్రయోజనంగా మారుతున్నాయన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ యోచించిన థర్డ్‌ ఫ్రంట్‌ టెంట్‌ వేయకముందే కూలిందన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సీఎం కేసీఆర్‌ వేసిన ఎత్తులు పనికిరాకుండపోయాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ కుమ్మక్కయ్యారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ నాయకుడని చెప్పుకుంటున్న కేసీఆర్‌ తెలంగాణకు చెందిన సాగునీరు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు.  

Updated Date - 2021-01-14T06:33:30+05:30 IST