YSRCP MLC ఆకస్మిక మృతి..

ABN , First Publish Date - 2021-11-20T06:58:23+05:30 IST

ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె...

YSRCP MLC ఆకస్మిక మృతి..

విజయవాడ/అజిత్‌సింగ్‌నగర్‌ : వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ కరీమున్నీసా(65) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. గతంలో 54వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న ఆమెకు ముస్లిం మైనార్టీలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.


సీఎం జగన్ దిగ్భ్రాంతి...

ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



Updated Date - 2021-11-20T06:58:23+05:30 IST