ఎమ్మెల్సీలుగా కవిత, దామోదర్రెడ్డి ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2022-01-20T07:20:13+05:30 IST
ఎమ్మెల్సీలుగా కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో బుధవారం ప్రొటెం చైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రీ వారితో ప్రమాణ స్వీకారం..
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీలుగా కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో బుధవారం ప్రొటెం చైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రీ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో ఎనలేని విశ్వాసం ప్రదర్శించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.