ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కృషి : MLC KAVTIHA
ABN , First Publish Date - 2021-12-12T16:28:07+05:30 IST
భారతదేశానికే హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మారుపేరుగా మారిందని, ఐటీ అభివృద్ధికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
హైదరాబాద్/ఉప్పల్: భారతదేశానికే హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మారుపేరుగా మారిందని, ఐటీ అభివృద్ధికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం నగరంలోని ఉప్పల్ డీఎ్సఎల్ అబాకస్ ఐటీ పార్కులో ఏర్పాటు చేసిన సాలిగ్రామ్ ఐటీ పరిశ్రమలను ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే భేతి సుభా్షరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐటీ అభివృద్ధికి లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చిందన్నారు. పరిశ్రమ ఏర్పాటు చేసిన బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రభుదాస్, శాంతి సాయిజెన్శేఖర్, శ్రీదేవి, గీత ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి పాల్గొన్నారు.