నాడు- నేడుతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
ABN , First Publish Date - 2020-07-08T11:07:28+05:30 IST
ప్రభుత్వ పాఠశాలకు నాడు- నేడు కార్యక్రమంతో మహర్దశ కలుగుతోందని ఉపాధ్యాయ ..
రాయచోటిటౌన్, జూలై7: ప్రభుత్వ పాఠశాలకు నాడు- నేడు కార్యక్రమంతో మహర్దశ కలుగుతోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మండలంలోని చెన్నముక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను గ్రామ సర్పంచ్ శ్రీనివాసులరెడ్డితో కలిసి పరిశీలించారు. ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులభూషణయ్య, ఎస్టీయూ రాష్ట్ర మైనా ర్టీకన్వీనర్ సనావుల్లా పాల్గొన్నారు.
సుండుపల్లెలో...
సుండుపల్లె, జూలై7: నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం మడితాడు, జీకె రాచపల్లెలో పాఠశాలలను సందర్శించారు. ఎస్టీవో మండల అధ్యక్షులు రవీంద్రనాధ్రెడ్డి, ప్రధానకార్యదర్శి ఇస్మాయిల్, స్టేట్ కౌన్సిలర్ ఆరీఫుల్లా పాల్గొన్నారు.