ఎమ్మెల్సీలు సునీత, శివనాథరెడ్డిలకు నోటీసులు

ABN , First Publish Date - 2020-05-30T11:55:00+05:30 IST

ఎమ్మెల్సీలు సునీత, శివనాథరెడ్డిలకు నోటీసులు

ఎమ్మెల్సీలు సునీత, శివనాథరెడ్డిలకు నోటీసులు

3న చైర్మన్‌ ముందు హాజరుకండి   

అమరావతి(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో పలు బిల్లులపై చర్చ సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు అనర్హత వేటు ఎందుకు వేయరాదో సంజాయిషీ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలకు శాసనసభ కా ర్యదర్శి బాలకృష్ణమాచార్యులు నోటీసులు పంపారు. పార్టీ విప్‌ ఉల్లంఘించినందున వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీ్‌ఫకు టీడీపీ విప్‌ బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూన్‌ 3 మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని లేఖలు పంపారు.

Updated Date - 2020-05-30T11:55:00+05:30 IST